లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నోట్ బుక్ ల పంపిణీ
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 01 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని వర్ష కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 9,10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు లయన్స్ క్లబ్, ఇబ్రహీంపట్నం వారి ఆధ్వర్యంలో ఉచిత నోట్ బుక్ లు 55 మంది విద్యార్థులకు లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఏలేటి చిన్నారెడ్డి, ఎంపిటిసి పొనకంటి వెంకట్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా చిన్న రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదిగి మీ గ్రామానికి,మీ తల్లిదండ్రులకు,చదువు నేర్పిన గురువులకు పేరు తేవాలని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్ లు అందించి నందుకు లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు శాంత భూషణ్,కార్యవర్గ సభ్యులు గణేష్,హరిప్రసాద్,ఉపసర్పంచ్ లక్ష్మణ్,నాయకులు దొంతుల తుక్కారం,ఉపాద్యాయులు పాల్గొన్నారు.
Share this on your social network: