ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 15ప్రజాపాలన ప్రతినిధి

Published: Friday December 16, 2022

*నియోజకవర్గంలో ప్రతి ఒక పెదకుటుంబానికి అండగా ఉంటా-ఎమ్మెల్యే మంచిరెడ్డి*

ఈ రోజు ఇబ్రహీంపట్నం మండలం కప్పపహడ్ గ్రామం కి చెందిన పేద కుటుంబానికి చెందిన జంగిలి మల్లేష్ కరోనా సమయంలో  కరోనా తో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స ఉండగా చనిపోవడం జరిగింది.చికిత్స కోసం కోసం డబ్బులు ఖర్చు అవగా  ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 60, 000/ రూపాయలు, మంజూరు చేసిన చెక్కుని  ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి కృపేష్, మండల్ పార్టీ అధ్యక్షులు చిలకల బుగ్గ రాములు, ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ నిట్టు వీరయ్య  తదితరులు పాల్గొన్నారు.