అరుంధతి కల్యాణ మండపం నిర్మాణ పనులను పర్యవేక్షించిన జడ్పీటీసీ

Published: Wednesday December 21, 2022
శంకరపట్నం డిసెంబర్ 20 ప్రజాపాలన రిపోర్టర్:


శంకరపట్నం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ దగ్గర్లో కొత్తగా నిర్మిస్తున్న అరుంధతి కల్యాణ మండపం నిర్మాణ పనులను మంగళవారము శంకరపట్నం జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్బంగా జడ్పీటీసీ మాట్లాడుతూ.. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలనీ కాంట్రాక్టర్ ని ఆదేశించారు. బీఆర్ ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, ఎంపీటీసీ మొయిన్, నాయకులూ బొజ్జ కోటి, మోత్కూరి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.