*ప్రజాపాలన షాబాద్ ::--షాబాద్ ప్రభుత్వ పాఠశాలకు రూ. 25 లక్షల తో బెంచిల పంపిణి*

Published: Tuesday December 27, 2022
గిఫ్ట్ ఏ స్మాయిల్ కింద కేటీఆర్ స్పూర్తితో పట్నం  అవినాష్ రెడ్డి వితరణ* 
షాబాద్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు స్థానిక జెడ్పిటీసీ పట్నం అవినాష్ రెడ్డి చేయూత ఇవ్వనున్నారు. 
ఇందులో భాగంగా  ఈ నెల 27 న తన జన్మదిన సందర్భంగా గిఫ్ట్ ఏ స్మాయిల్ కింద రాష్ట్ర  ఐటి శాఖ మంత్రి  కేటీఆర్ స్పూర్తితో పట్నం  అవినాష్ రెడ్డి అన్ని ప్రభుత్వ  ప్రాథమికోన్నత, ఉన్నత  పాఠశాలలకు సుమారు రూ. 25 లక్షల స్వంత నిధులతో  600 బెంచీలను అందిస్తున్నారు. 
గిఫ్ట్ ఏ స్మాయిల్ కింద కేటీఆర్ స్పూర్తితో పట్నం  అవినాష్ రెడ్డి వితరణ సాగుతుండగా, 
షాబాద్ లోని   Zphs Boys పాఠశాలలో తీగల అనిత రెడ్డి,అతిథులుగా చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, మాజీ  మంత్రి, ఎంఎల్సీ పట్నం మహేందర్ రెడ్డి, శంబిపూర్ రాజు,
ఎంఎల్ఏలు  యాదయ్య,నరేందర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్,  మహేష్ రెడ్డి, డీసీసీబీ చైర్మెన్ మనోహర్ రెడ్డి తదితరుల
 చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు.   పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గూడూరు నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీరామ్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నక్క శ్రీనివాస్ గౌడ్, సహకార సంఘం చైర్మన్ చల్లా శేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.