వికారాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ పి సుధారాణి
Published: Tuesday September 06, 2022
ప్రజా ప్రస్థాన పాదయాత్రకు బ్రహ్మరథం
వికారాబాద్ బ్యూరో 05 సెప్టెంబర్ ప్రజా పాలన : వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వికారాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ పి సుధారాణి కొనియాడారు. సోమవారం ప్రజాప్రస్థాన పాదయాత్ర 143 వ రోజు చేరిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రజాప్రస్థాన పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అడుగడుగునా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ షర్మిలక్క ముందుకు సాగుతున్నారని వివరించారు. షర్మిల అక్క తో పాటు అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతున్న వికారాబాద్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ పి.సుధా రాణి.
Share this on your social network: