ఆళ్ళపాడు గ్రామంలో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయుటకు ఏర్పాట్లు

Published: Wednesday December 15, 2021
బోనకల్, డిసెంబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామంలో నర్సరీ ఏర్పాటుకై గ్రామంలో మొక్కల పంపిణీ చేయుటకు 2021 సం, 2022 సంవత్సరానికి గాను నర్సరీలు ఏర్పాటు చేసి గ్రామంలో ఇంటింటికీ మొక్కలు అందించేందుకు మట్టిని ఎరువుని కెమికల్ కలిపి తయారుచేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ పెంచిన నర్సరీ గ్రామంలో ప్రజలందరికీ ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున అందించి ఇతర గ్రామలకి కూడ మొక్కలు పంపించడం జరిగింది. మండలం లోనే మొదటి స్థానంగా పెంచి మొక్కలను అందించనైనది ఈ సంవత్సరం కూడా మట్టిని మంచిగా తయారు చేసి ఎరువులు వేసి బ్యాగ్ ఫీలింగ్ చేసి నర్సరిని మొదటి నుండి మంచిగా పెంచే విధంగా తయారు చేయ నైనది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు, పంచాయతీ కార్యదర్శి పరశురామ్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.