కరోనా కట్టడికి ప్రజలందరూ సహకరించాలి : మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్ రెడ్డి
Published: Tuesday May 18, 2021
మేడిపల్లి, మే17 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా కట్టడికి ప్రజలందరూ బాధ్యతగా సహకరించాలని కాంగ్రెస్ నాయకులు, మాజీ కార్పొరేటర్ మందుముల్ల పరమేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉప్పల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా మాజీ కార్పొరేటర్ మందుముల్ల పరమేశ్వర్ రెడ్డి(ఎంపీఆర్) తన సొంత ఖర్చుతో సోమవారం ఉప్పల్, గాంధీ నగర్, ఇందిరానగర్, రాఘవేంద్ర కాలనీ, సూర్యనగర్ కాలనీ, కురుమనగర్ కాలనీల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. ఈ కార్యక్రమంలో సుక్క జీవన్, తోకట రాజు, బిక్కుమళ్ల అశోక్ గుప్తా, బోరంపేట్ జయకృష్ణ, సల్ల ప్రభాకర్, మంద మురళి, బూత్కూరి రాజు, భాస్కర్ రెడ్డి, ప్రేమ్, అరుణ్, ఏసూరి మల్లేష్, బద్రి, బ్యాండ్ మహేష్, శ్రీను, ఏర దాస్, గుండె సాయి, ఏసూరి నందు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: