జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం రోజున జెండాలు ఎగరేయాలి...

Published: Friday June 25, 2021
జగిత్యాల, జూన్ 24 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల ఎస్ఆర్ఎస్పి గెస్ట్ హౌస్ లో పడిగెల మల్లన్న మాదిగ జగిత్యాల నియోజక వర్గ ఇన్చార్జి ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జగిత్యాల జిల్లా ఎమ్మార్పీఎస్ కన్వీనర్ దుమాల గంగారం మాదిగ హాజరై మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాదిగ మాదిగ ఉపకులాలు అన్ని మండల కేంద్రంల్లో అన్ని గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ జెండాలను జులై 7న ఆవిర్భావ దినోత్సవం రోజున జెండాలను ఎగరేయలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో నూతన కమిటీలను నిర్వహించి యువకులు రాజకీయంగా చైతన్యం పెంపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ మాదిగా బెజ్జంకి సతీష్ మాదిగ మాట్ల బుచ్చన్న బోనగిరి కిషన్ నక్క సతీష్ బొల్లె అనిల్ దుమాల పెద్ద గంగారం మీసాల సాయిలు దయ్యాల హనుమాన్లు పానుగంటి భాస్కర్ ముప్పవరపు రామస్వామి బొల్లారపు గిరిధర్ మాదిగ తదితరులు