సమస్యల పరిష్కారం కోసం అడిషనల్ కలెక్టర్ కు వినతి

Published: Wednesday December 29, 2021
బెల్లంపల్లి మునిసిపల్ ప్రజా ప్రతినిధులు. బెల్లంపల్లి: డిసెంబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణంలోని పలు ప్రధాన  సమస్యల  పరిష్కారం కోసం మరియు మున్సిపల్ కార్మికుల నియామకాలకు అనుమతివ్వాలని స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు మంగళవారం నాడు మంచిర్యాలలోని కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత తెలిపారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ శ్వేత మాట్లాడుతూ బెల్లంపల్లి మున్సిపల్ లో పరిష్కారం కాకుండా ఉన్న సమస్యల పరిష్కారానికి జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశామని, అధికారులు సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.