శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతిని ఘనంగా నిర్వహించిన-బి.జె.పి రాయికల్ పట్టణశాఖ
Published: Thursday July 07, 2022
రాయికల్, జూలై 06 (ప్రజాపాలన ప్రతి నిధి):
భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త శ్యాంప్రసాద్ ముఖర్జీ '121' వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాయికల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహం చౌరస్తాలో ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కల్లెడ ధర్మపురి మాట్లాడుతూ
శ్యాంప్రసాద్ ముఖర్జీ ఈ దేశసంస్కృతి,సంప్రదాయాలవిలువలను కాపాడుతున్న భారతీయజనతాపార్టీ స్థాపితంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ పాత్ర,త్యాగాలు ఎనలేనివని,శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క స్ఫూర్తితో బి.జె.పి ని కార్యకర్తలందరం ముందుకుతీసుకు వెళతామనితెలిపారు. ఈ కార్యక్రమంలో బి.జె.పిపట్టణఅధ్యక్షులు కల్లెడధర్మపురి,మహిళామోర్చజిల్లాఅధ్యక్షులు భాగ్యలక్ష్మి, ప్రధానకార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి,ఉపాధ్యక్షులు శ్రీకాంత్,కె మల్లారెడ్డి,మల్లేష్ యాదవ్,కునారపు భూమేష్,శ్రీనివాస్ కార్యదర్శి సతీష్, ప్రేమ్, రామకృష్ణ,సంతోష్ కోశాధికారిశంకర్,ఆశన్న, సతీష్,లక్ష్మికాంతం, దళిత మోర్చా అధ్యక్షులుసంజీవ్,వెంకటాద్రి యువమోర్చా అధ్యక్షులు ప్రవీణ్, ఉపాధ్యక్షులురవి,శ్రీగద్దే సుమంత్,సాయిరాం వెంకట్రెడ్డి,గోపి, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this on your social network: