ఉపకార వేతనాలకు గిరిజన విద్యార్థుల దరఖాస్తులు ఆహ్వానం

Published: Wednesday October 19, 2022
జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటాజి
వికారాబాద్ బ్యూరో 18 అక్టోబర్ ప్రజా పాలన : మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ ఎఫైర్  ఆధ్వర్యంలో 2022-23విద్య సంవత్సరానికి స్కాలర్ షిప్ కొరకు గిరిజన విద్యార్థిని /విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఆర్. కోటాజీ  మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  ఉన్నత విద్య చదువుతున్న గిరిజన విద్యార్థిని /విద్యార్థులు  ఫ్రెష్, రెన్యువల్ కు అక్టోబర్ 31 వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన తెలిపారు. http://scholarships.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.గిరిజన విద్యార్థిని/ విద్యార్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.