మంజీర డైమండ్ టవర్స్ లో స్వీయ వ్యాక్సినేషన్ సెంటర్ - కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

Published: Thursday June 17, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మంజీర డైమండ్ టవర్స్ వారు సిటిజన్స్ హాస్పిటల్ వారి పర్యవేక్షణలో క్లబ్ హౌస్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ మంజీర డైమండ్ టవర్స్ వారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారని, అసోసియేషన్ వారు సిటిజన్స్ ఆసుపత్రి సహకారంతో వ్యాక్సినేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసుకోవడం అభినదించ దగ్గ విషయమని అన్నారు. ఈ వ్యాక్సినేషన్ మంజీర డైమండ్ టవర్స్ లో నివసిస్తున్న ప్రజలకు ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. అవకాశాన్ని అందరు సద్వినియోగ అందరు పర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఎక్కువ సంఖ్యలో ప్రజలు నివసించే అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ లలో ఇలాంటి ప్రత్యేక వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు వేసుకోవడం వల్ల త్వరితగతిన వ్యాక్సిన్ దక్కుతుందని అన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంజీర డైమండ్ టవర్స్ లో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్ దృష్టికి, మంజీర డైమండ్ టవర్స్ అధ్యక్షులు శ్రీజిత్ నైర్ తీసుకువచ్చారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, మాజీ అధ్యక్షులు రమేష్ సోమిశెట్టి, వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ ప్రసాద్, సెక్రటరీ అతుల్ సింగ్, జాయింట్ సెక్రటరీ సిద్ధార్థ్ రమబద్రి, కామేశ్వర రావు, సీనియర్ నాయకులు మన్నే రమేష్ నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.