విగ్రహ ప్రతిష్ట ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Published: Saturday June 26, 2021
పటాన్చేరు, జూన్ 25, ప్రజాపాలన ప్రతినిధి : పటాన్చేరు మండలం భానూర్ గ్రామ పరిధిలోని కంచర్ల గూడెంలో జీర్ణోద్ధరణ గావించిన శ్రీ భ్రమరాంబిక కేతకి సమేత మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన పత్రికను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. వచ్చే నెల 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గ్రామ మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి తెలిపారు.