ఉత్తమ సేవలు అందించిన వారికి కలెక్టర్ ఘన సన్మానం

Published: Friday January 27, 2023
వికారాబాద్ బ్యూరో 26 జనవరి ప్రజా పాలన : ప్రభుత్వం అప్పగించిన పనులను తమ శక్తి మేరకు నిజాయితీతో నిబద్ధతతో పూర్తి చేసిన వారికి తగిన సత్కారం లభిస్తుంది. ప్రజలకు ప్రభుత్వ అధికారులకు మధ్య వారధిగా సమన్వయంతో వ్యవహరించడం శక్తికి మించిన పని. గురువారం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఉత్తమ సేవలు అందించిన వారికి జిల్లా కలెక్టర్ కె నిఖిల ధ్రువపత్రాలతో ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమాలపై ప్రజల చెంతకు దినపత్రికల ద్వారా చేరవేయడంతో పాటు జిల్లా కలెక్టర్ మంత్రుల పర్యటనల గురించి ప్రెస్ కవరేజ్ ద్వారా ప్రచారం గావించినందుకు మహమ్మద్ ఆరిఫుద్దిన్, సహాయ పౌర సంబంధాల అధికారి బూరన్ ప్రభాకర్ లకు జిల్లా కలెక్టర్ కె.నిఖిల ఉత్తమ ప్రశంసా పత్రాలు అందజేశారు. మోమిన్ పేట్ మండల పరిధిలోని చీమల్ దరి గ్రామ ప్రజలకు ప్రజాప్రతినిధులకు సమన్వయకర్తగా వ్యవహరిస్తూ విశిష్ట సేవలు అందించిన
 పంచాయతీ కార్యదర్శి సుగుణకు జిల్లా కలెక్టర్ చేతులమీదుగా గణతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రశంసా పత్రాన్ని అందజేశారు.