సదరం స్లాట్ బుకింగ్ తో ప్రజల అవస్థలు శంకరపట్నం ఫిబ్రవరి 27 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Tuesday February 28, 2023

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వివిధ రకాల వైకల్యాలు కలిగిన పేదలకు పింఛన్లు ఇవ్వడానికి నిర్ధారించే పరీక్ష కోసం సదరం క్యాంపుకు వివిధ కేటగిరీల వారీగా తేదీలను నిర్ధారించారు. అయితే ఆ క్యాంపుకు వెళ్లడానికి ముందుగా ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవలసి ఉండగా, ప్రజలు దూర ప్రాంతాల నుండి ఆన్లైన్ కేంద్రాలకు  వచ్చి బారులు తీరారు. ఎంతో నిరీక్షణగా ఉన్నప్పటికీ ఆ ఆన్లైన్ సైట్ కొద్దిసేపట్లోనే సైటు ముగిసి పోతుడడంతో ఆన్లైన్ సెంటర్ ల వద్ద ఎంతో దూరం నుంచి వచ్చిన  పేద ప్రజలు అంగవైకల్యాలు కలవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పదినిమిషాలలోనే సైటు ముగియడంతో ఇది ప్రజలను మోసగించే ప్రక్రియగా ప్రజలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వీరి ఇబ్బందులను గుర్తించి స్లాట్ బుకింగ్ టైంలో పెంచాలని ప్రజలు కోరుతున్నారు.