రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Published: Tuesday August 03, 2021

జన్నారం, ఆగస్టు 2, ప్రజాపాలన ప్రతినిధి : మండలంలోని బాదం పల్లి గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణ కార్పెంటర్ గొల్లపల్లి లక్ష్మణాచారి జగిత్యాల జిల్లా కొల్లాయి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు, మృతునికి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారని మృతుని బంధువులు తెలిపారు కాగా రోడ్డు ప్రమాదంలో మరణించిన లక్ష్మణాచారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు విశ్వబ్రాహ్మణ జిల్లా విశ్వకర్మ జిల్లా అధ్యక్షులు మట్టెల రమేష్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీపాద రమేష్  వెలిగండ్ల రవి లు తెలిపారు