మండల వైధ్యాదికారి అద్యర్యంలో ఉచిత వైద్య శిబిరం

Published: Saturday September 24, 2022

జన్నారం, సెప్టెంబర్ 23, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మ పూర్, కలమడుగు నర్సింగపూర్ గ్రామాలలో అధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని మండల వైధ్యాదికారి ప్రసాద్ రావు శుక్రవారం అన్నారు. ఆ సందర్భంగా గ్రామంలో జ్వర పీడితుల రక్త పరీక్ష, బిపి, షుగర్ పరీక్ష లు చేసి,  మందులు పంపిణీ చేయడం జరిగిందని అయన తెలిపారు. మండల గృహ సందర్శన చేసి గర్భిణి స్త్రీలు, బాలింతలకు, పోషక ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రత, గురించి బోధించడం జరిగిందని   అయన వివరించారు.  ప్రజలకు ఇంటి ఆవరణలో పరిశుభ్రత , నీరు నిలువ ఉండ కుండ చర్యలు తీసుకోవాలని డ్రై డే కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అయన సూచించారు. ఈ కార్యాక్రమంలో ఎంపిటిసి  వెంకట స్వామి, కొల్లూరి కమలాకర్, మండల ఆరోగ్య పర్యవేక్షకులు పోచయ్య, జే దీవెన పిఎచ్సి, పి సుశీల ఎచ్ఎ, టి రాంబాబు ఎచ్ఎ, విస్వశా ఎచ్ఎ, అరోగ్య కార్యకర్త, అపరంజి, ఆరోగ్య కార్యకర్త, రజిత, ఆశ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.