డయాగ్నో టిక్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

Published: Monday August 08, 2022
బెల్లంపల్లి ఆగస్టు 7 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణంలో ని హనుమాన్ బస్తీలో  నూతనంగాఏర్పాటుచేసిన వినాయక డయాగ్నో స్టిక్  కేంద్రాన్ని ఆదివారము  ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సదుపాయాలను ఎక్కడికక్కడ ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చి వివిధ పరీక్షలు చేయించుకోవడానికి, డయాగ్నొస్టిక్ కేంద్రాన్నీ ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. 
ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా నిర్వాహకులు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డయోగ్నొస్టిక్ సెంటర్ నిర్వాహకులు పోలు శ్రీనివాసు, ఆయన మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో  మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్ , స్థానిక వార్డ్ కౌన్సిలర్ పొలు వుమాదేవి, పలువురు కౌన్సిలర్లు మరియు కో ఆప్షన్ సభ్యులు,స్థానిక ప్రజాప్రతినిధులు,తెరాసా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.