మొక్కలు నాటిన మంత్రి

Published: Monday June 28, 2021
బాలపూర్, జూన్ 27, ప్రజాపాలన ప్రతినిధి : నియోజకవర్గంలోని గొలుసుకట్టు చెరువులను సుందరీ కరణంగా మార్చాలని దృక్పథంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారంగా కోమటికుంట, పోచమ్మ కుంట మరమ్మతు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మొక్కలు నాటి పరిరక్షణ పర్యవేక్షణ బాధ్యతలను ప్రతి ప్రజా ప్రతినిధులు సక్రమంగా పనిచేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సం రెడ్డి స్వప్న వెంకటరెడ్డి, టిఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు యువకులు కాలనీవాసులు ప్రజాప్రతినిధులు కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.