ప్రియునితో కలిసి భర్తను చంపిన భార్య

Published: Tuesday August 24, 2021
అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని హత్య
వికారాబాద్ బ్యూరో 23 ఆగస్ట్ ప్రజాపాలన : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో ఈ నెల 17వ తేదీన గుర్తు తెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేసి నిప్పు అంటించి దహనం చేసిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలు డిఎస్పి లక్ష్మీనారాయణ వెల్లడించారు. మృతుడు హనుమంతు హత్యకు కారణమైన అంబిక, రేవన్ సిద్ధప్ప కర్ణాటక రాష్ట్రం ఎలాక్ పల్లి గ్రామానికి చెందిన వారు. హత్య గావించబడిన హనుమంతు ఎనిమిది సంవత్సరాల క్రితం పక్షపాతంతో ఒక చెయ్యి, ఒక కాలు పనిచేయకపోవడంతో తాగుడుకు బానిసయ్యాడు. వారి అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఈ నెల 16వ తేదీ హనుమంతుకు నిందితుడు రేవన్ సిద్ధప్ప ఫోన్ చేసి పిలిపించాడు. బషీరాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లే మార్గంలో హనుమంతుకు మద్యం తాగించి నవాంద్గి గ్రామ శివారులో రేవన్ సిద్ధప్ప రాయితో తల వెనుక భాగంలో కొట్టాడు. రాయి దెబ్బ తగిలిన హనుమంతు కిందపడ్డాడు. భార్య అంబిక కిందపడిన హనుమంతు గొంతు నులపగా అప్పటికే కొన ఊపిరితో ఉన్న అతన్ని చూసి కల్వరతో గొంతు పైభాగం కోసి హత్య చేశారు. హనుమంతు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని మూటకట్టి భుజం పైన ఎత్తుకుని కొంత దూరం నడిచారు. బరువు మోయలేక అక్కడే మృతదేహాన్ని పడేసి మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి వెళ్ళిపోయారు. ఈ కేసును ఛేదించిన రూరల్ సిఐ జలంధర్ రెడ్డిని డిఎస్పి లక్ష్మీనారాయణ అభినందించారు.