పార్టీ బలోపేతమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం

Published: Saturday February 20, 2021

మధిర, ఫిబ్రవరి 19, ప్రజాపాలన: మున్సిపాలిటీ పరిధిలో 21వ వార్డులో ముమ్మరంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని టిఆర్ఎస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా మధిర మున్సిపాలిటీ లో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపట్టాలని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు టీఆర్ఎస్ నాయకులకు వార్డు కౌన్సిలర్ లకు సూచించారు. ఈరోజు 21 వార్డు లో ఆర్ వి కాంప్లెక్స్ ఎదురు 21వ వార్డు కౌన్సిలర్ ఎర్రగుంట లక్ష్మీ రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ బలోపేతం లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు నాయకులకు సూచించారు. ఈ సందర్భంగా ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి మొట్టమొదటిసారి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారి చేతుల మీదగా టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న సీనియర్ నాయకులు పల్లపోతుల ప్రసాద్ రావు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు పట్టణ కార్యదర్శి అరిగే శ్రీనివాస రావు మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తరు నాగేశ్వరరావు  మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి వార్డ్ కౌన్సిలర్ లు వై వి అప్పారావు ఇక్బాల్ మాధవి టిఆర్ఎస్ నాయకులు కర్నాటి శ్రీనివాసరావు చావా వేణు పళ్ళ పోతుల వెంకటేశ్వర రావు, కపిలవాయి జగన్, యూత్ నాయకులు కోన నరేందర్ రెడ్డి వాల్మీకి పవన్ అబ్బూరి రామన్ పరస శీను జేవీ రెడ్డి, వార్డు కౌన్సిలర్ లు పట్టణ మరియు మండల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.