బాసర ఐఐఐటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
Published: Thursday June 16, 2022
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సినియార్ నాయకులు కోడూరి చంద్రయ్య
జన్నారం రూరల్, జున్ 15, ప్రజాపాలన: బాసరలోని ఐఐఐటి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సినియార్ నాయకులు కోడూరి చంద్రయ్య డిమాండ్ చేశారు, బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు, గత కొద్ది రోజులుగా అనేక సమస్యల పరిస్కరం కోసం బాసర ఐఐఐటి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఐఐఐటి ని సందర్శించి సమస్యలు పరిష్కారం చేయాలి కోరారు. అదేవిధంగా రెగ్యులర్ విసి నియమించాలని, విద్యార్థుల సంఖ్య కు అనుగుణంగా అధ్యాపకుల సంఖ్య పెంచాలని కోరారు. , ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ, అదారిత విద్యను అందించాలని అదేవిధంగా ఇతర వర్శిటీలు సంస్థలో ఐఐఐటి ని అనుసంధానం చేయాలని తెలిపారు, తరగతి హాస్టల్ గదులను మరమ్మతులు చేయాలని సూచించారు, ల్యాప్ టాపులు, యునిపాం, బెడ్ లు అందించాలని, బోజన సౌకర్యం మెంటాటిన్స్ మెరుగుపడేలా చూడాలన్నారు, పిడి పెట్ నియమించి ప్రోసహ్సించాలని తెలిపారు, ఈ కార్యక్రమంలో వైఎస్అర్ తెలంగాణ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు అండ్ర పురుషోత్తం, జన్నారం మండల నాయకులు తౌటు సంజీవ్, కోప్పుల రాము, మేదరి వేణు, వేముల సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: