ఆలయ అభివృద్ధికి 10వేలు వితరణ..
Published: Monday August 08, 2022
తల్లాడ, ఆగస్టు 7 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడ మండలం కేశవపురం గ్రామంలో ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం విస్సన్నపేట గ్రామ వాస్తవ్యులు గోల్కొండ వెంకటకృష్ణారావు దంపతులు 10వేలు ఆదివారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. దాతలు అందించిన ఆర్థిక సహాయాన్ని ఆలయ కమిటీ సభ్యులు,చావా తిరుమలరావు, సాదం రమేష్ తీసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వనిగండ్ల అలేఖ్య అశోక్ విరాళం అందజేసిన దంపతులకు ఆలయ కమిటీ తరఫున,కేశవపురం గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వనిగండ్ల కృష్ణమూర్తి, కట్టా నాగేశ్వరావు,వనిగండ్ల నరసింహారావు పాల్గొన్నారు.
Share this on your social network: