గాయపడ్డ బాలున్ని తల్లిని పరామర్శించిన వడ్ల నందు

Published: Tuesday February 07, 2023

వికారాబాద్ బ్యూరో 06 ఫిబ్రవరి ప్రజాపాలన : ప్రమాదంలో గాయపడిన బాలున్ని, తల్లిని ఉస్మానియా ఆసుపత్రి లో పరామర్శించానని బిఆర్స్ఎస్ యువజన రాష్ట్ర నాయకులు వడ్ల నందు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాయపడిన వారిని పరామర్శించి వైద్య చికిత్స నిమిత్తం బాధిత కుటంబానికి రూ. 10000 లు ఆర్థిక సహాయం అందజేశామని వివరించారు. ధారూర్ మండలం కొండాపూర్ కలాన్ గ్రామానికి చెందిన  లాలయ్య కుమారుడు గణేష్ (3) ప్రమాదవశాత్తు గ్రామంలో గల పాత కార్ వద్ద ఆడుకుంటుండగా మంటలు చెలరేగి తీవ్ర గాయాలపాలయ్యాయి. హుటాహుటిన హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ యువజన విబాగం రాష్ట్ర నాయకులు, వడ్లనందు ఫౌండేషన్ చైర్మన్ వడ్ల నందు ఆసుపత్రికి వెళ్లి బాలుని పరిస్థితిని పరిశీలించి తల్లిదండ్రులను ఓదార్చారు. సంబంధిత ఆస్పత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి బాలునికి ఎటువంటి హానికలగకుండా చికిత్స అందించాలని సూచించారు. బాలుని తల్లిదండ్రులకు తన వంతు ఆర్థిక సహాయంగా 10000 రూపాయల నగదును అందజేశారు. కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న బాలుని పరిస్థితి చూసి తాను పూర్తిగా  చెల్లించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఎటువంటి సహాయం కావాలన్నా తన వంతుసాయంగా వారికి సాయం చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఆసుపత్రి నుండి బయటకు రావాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.