ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ని కలిసిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
Published: Wednesday February 02, 2022
కోరుట్ల, ఫిబ్రవరి 01( ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల నియోజకవర్గ పలు అభివృద్ధి పనుల నివేదికకై మంగళవారం రోజున ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ని టీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కలిశారు. నియోజవర్గంలోని అభివృద్ధికి సంబంధించిన నివేదికను సమర్పించి, జగిత్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా నియమించినందుకు కృజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో జగిత్యాల జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ నీ మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.
Share this on your social network: