గణేష్ నిమజ్జనానికి పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం : అడ్మిన్ ఎస్పీ సురేష్ కుమార్

Published: Thursday September 16, 2021
జగిత్యాల, సెప్టెంబర్ 15 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో జిల్లా అడ్మిన్ ఎస్పీ సురేష్ కుమార్ హాజరై మాట్లాడుతు జిల్లాలోని నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ ప్రజలకు ఇబ్బందులు కలగకుండ చూడలని పోలీసు అధికారులకు సూచించారు. పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ పర్యవేక్షణ చేయాలని విద్యుత్ సమస్య రాకుండ చూడలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ అధికారులు సంబంధిత సిబ్బందితో గణేష్ విగ్రహాలను చెరువులోకి పంపించే సమయంలో క్రేనులతో వీలైనంత త్వరగా నిమజ్జనం చేయాలని వివిధ శాఖల అధికారులకు తెలియజేశారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు నిమజ్జన కార్యక్రమంలో సహకరించాలని కోరారు. గణేశ్ ఉత్సవ కమిటీలు నిమజ్జన కార్యక్రమాన్నీ శాంతియుతంగా విజయవంతం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ స్వరూపరాణి డిఎస్పీ రత్నపురం ప్రకాష్ కుమార్ పట్టణ సీఐ కిషోర్ విద్యుత్ శాఖ ఏడి ఆర్ అండ్ బీ విద్యుత్ శాఖ అదికారులు మరియు పట్టణ గణేష్ ఉత్సవ కమిటి అధ్యక్షులు పాల్గొన్నారు.