సున్నపు చెరువు లో వినాయక నిమజ్జనం

Published: Wednesday September 15, 2021
 బాలాపూర్, సెప్టెంబర్14, ప్రజాపాలన ప్రతినిధి : బడoగ్ పెట్ కార్పొరేషన్ పరిధిలో ని నాదరుగుల్ గ్రామంలో ఉన్న సున్నం చెరువును వినాయకుని నిమార్జనల కొరకు పరిసిలిస్తున్న అదిబట్ల పోలీసు సీఐ నరేందర్, కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, స్థానిక కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, గుడెపు ఇంద్రసేన, కో ఆప్షన్ సభ్యులు జగన్మోహన్ రెడ్డి, బ్యాంక్ డైరెక్టర్ తోట ప్రతాప్ రెడ్డి,కార్పొరేషన్ ఏ. ఈ రాంప్రసాద్ తో పలువురు కలిసి పర్యవేక్షించి నిర్ధారణ నిర్వహించారు. ఈ సందర్భంగా సి ఐ నరేందర్ మాట్లాడుతూ..... కార్పొరేషన్ నుండి క్రేన్, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా భారీ క్రేన్లు పెట్టిస్తే మా పోలీస్ రక్షణ కల్పిస్తామని అన్నారు. అలాగే మేయర్, కార్పొరేటర్ల్ మాట్లాడుతూ... కార్పొరేషన్ నుండి క్రేన్, భారీ క్రేన్లు కు ఏర్పాట్లు ఇస్తామని చెప్పారు. వినాయకుని భక్తులకు మనవి నాదరుగుల్ గ్రామ ప్రజలు, చుట్టూ పక్కన ఉన్న గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడ నిమార్జనం చేసుకోవాల్సిందిగా చెప్పారు. అలాగే అందరం నిమార్జనం విషయంలో పోలీస్ శాఖ వారికి సహకరించాలని విజ్ఞప్తి బోలో గణేష్ మహరాజ్ కి జై!