ఘనంగా అయ్యప్ప స్వాముల ఇరుముడి మహోత్సవం

Published: Friday December 23, 2022
మేడిపల్లి, డిసెంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్ శ్రీనగర్ కాలనీలోని హనుమాన్ ఆలయంలో  అయ్యప్ప స్వాముల ఇరుముడి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్ బండారు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అయ్యప్ప స్వాముల దీక్షకాలం ముగిసే రోజులలో దీక్ష విరమణకు శబరిమలై వెళ్లే ముందు ఇరుముడి కార్యక్రమమును నిర్వహిస్తారు. ఇది గురుస్వాముల సమక్షంలో వారి సూచనల, పూజల తతంగంతో ముగుసిన తరువాత, అయ్యప్ప స్వాములు దీక్ష విరమణకు శబరిమల యాత్రకు బయలుదేరుతారు. ఇరుముడి కార్యక్రమం అనంతరం బండారి లక్ష్మారెడ్డి అయ్యప్ప స్వాముల శబరిమల యాత్ర క్షేమంగా ముగియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు నాగ శేఖర్, యాకాంత రాము, శివ, హరీష్ మరియు బి ఆర్ ఎస్ నాయకులు నరేష్, జహంగీర్, సూరం శంకర్, అరవింద్, రాజు యాదవ్, బోసాని పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.