ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేతుల మీదిగా ప్రశంసా పత్రాలు అందజేత

Published: Monday October 04, 2021
కోరుట్ల, అక్టోబర్ 03 (ప్రజాపాలన ప్రతినిధి) : భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కొరుట్ల పట్టణ పారిశుద్ధ్య కార్మికులకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్లవిద్యా సాగర్‌ రావు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందిచారు. ఈ కార్యక్రమం మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ అన్నం లావణ్య అనిల్‌, మునిసిపల్‌ కమీషనర్‌ ఎండి అయాజ్‌, వైస్‌ చైర్మన్‌ గడ్డమిది పవన్‌, శానిటరీ ఇన్స్పెక్టర్‌ గజానంద్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ ప్రవీణ్‌, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.