కేశవాపురంలో డ్రైడే కార్యక్రమం..

Published: Saturday July 30, 2022

 తల్లాడ, జులై 29 (ప్రజాపాలన న్యూస్):

తల్లాడ మండలంలోని కేశవాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ వనిగండ్ల అలేఖ్యఅశోక్ ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైడే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీఓ శ్రీదేవి, గ్రామ సర్పంచ్ అలేఖ్యతో కలిసి గ్రామంలో ఇళ్లల్లో ఉన్న తొట్లలో, గాబుల్లో నిల్వ ఉన్న నీటిని పారబోయించారు. మురికి నీరు ఉండటంవల్ల వ్యాధులు సోకుతున్నాయని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ సైదులు, వివోఏ అనసూర్య, తదితరులు ఉన్నారు.