ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 2ప్రజాపాలన ప్రతినిధి *పాస్టర్ యాకోబ్ సేవలు మరువలేనివి*

Published: Thursday November 03, 2022

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన పాస్టర్ యాకోబు సమాధి కార్యక్రమానికి హాజరైన క్రిస్టియన్ నియోజకవర్గం మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి రాజు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ  యాకోబు పాస్టర్ ఎంబి ఫీల్డ్ లో అనేక ప్రాంతాలలో దేవుని సేవ చేస్తూ ప్రజల పట్ల ప్రేమ, కరుణ, దయ, జాలితో పనిచేశారని, తోటి మానవులకు సేవలు చేస్తే ఆత్యాగం  దేవుని చెంతకు  చేరుతుందని అనేవారని ఆయన సేవలను కొనియాడారు. ప్రస్తుతం మల్కిజ్ గూడా పాస్టర్ గా దేవుని పని చేస్తున్నాడని అన్నారు. ఇటీవల అనారోగ్యంపాలైన  పాస్టర్ యాకోబు  దేవునిలో ఐక్యమయ్యారని,  దీనికి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని తెలిపారు. ఆయన చేసిన సేవలు మరువలేనివని అతని కుటుంబానికి నియోజకవర్గం పాస్టర్స్ కమిటీ లీడర్స్ తరపున  అండగా ఉంటామని ప్రఘాడ సానుభూతి తెలిపారు. సమాధి కార్యక్రమానికి హాజరైన  నాలుగు మండలాల పాస్టర్లు యాచారం మండల అధ్యక్షులు క్రిస్టపాల్, ప్రభాకర్, భాస్కర్, సుందర్, మధుకర్, సత్యం, జై రాజు  కర్ణాకర్, సైమన్ పీటర్ సన్నుత్ రాజు సదానంద్
తదితరులు పాల్గొన్నారు.