గ్రాజ్ సొసైటీ సర్వీస్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు పంపిణీ

Published: Tuesday December 27, 2022
బోనకల్, డిసెంబర్ 26 ప్రజాపాలన ప్రతినిధి: గ్రాజ్ సోసైటి సర్విస్ సంస్థ సభ్యులు జాకప్ ఎన్ ఎస్ పాల్ వారి ఆధ్వర్యంలో నిరుపేద పిల్లలకు ఆళ్లపాడు గ్రామంలో 100మందికి ఈ సంస్థ ఆధ్వర్యంలో 10రకాలతో కూడిన ప్యాకేజీని దుప్పట్లు, సబ్బులు, పేస్టు, బ్రేస్, కాల్గేటు, స్నేక్స్ ఇతర వస్తూవులు జడ్పిటిసి సుదిర్ బాబు, సర్పంచ్ మర్రి తిరుపతి రావు చేతుల మీదుగా పంపిణి చేయించారు. మండలంలో వివిధ గ్రామాల్లో సుమారు వేయ్యి మందికి పంపిణీ చేసామని సంస్థ వారు తేలియచేసీనారు. ఈ విధంగా పంపిణీ చేసిన సంస్థ సభ్యులకు గ్రామ పెద్దలు అభినందించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు గ్రామ పేద్దలు తదితరులు పాల్గొన్నారు.