లిమ్స్ హాస్పటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

Published: Friday January 07, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 6 ప్రజాపాలన ప్రతినిధి : గురువారం రోజు యాచారం మండలం పరిధిలో కొత్తపల్లి గ్రామంలో లిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శాల ప్రారంభించడం జరిగింది. కొత్త పల్లి సర్పంచ్ హబీబ్ ఉప సర్పంచ్ కావాలి జగన్ ఎంపిటిసి సుమతమ్మ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ సేవలను అందించడంలో లిమ్స్ హాస్పిటల్ యజమాన్యం వివిధ మండలాల్లో క్యాంపే ఇయన్ నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యం అందిస్తూ ఆస్పటల్ కు నూతన సంవత్సర సందర్భంగా ఎలాంటి జబ్బులు అయినా అవలీలగా నయం చేసే విధంగా లిమ్స్ హాస్పిటల్ కృషి చేస్తుందని అని గ్రామ సర్పంచ్ హబీబ్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మరియు వైద్య బృందం డాక్టర్ రామ్ రాజ్ విశ్వనాధ్ దినేష్ తేజ నరేష్ ఆనంద్ రానా మేనేజర్ కాలే భాష శ్రీను పాల్గొనడం జరిగింది పేషెంట్లు మూడు వందల మంది పాల్గొనడం జరిగింది.