ఘనంగా రేణుక ఎల్లమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలు

Published: Wednesday July 28, 2021
మేడిపల్లి, జూలై 27 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ నగర పాలక సంస్థ 24వ డివిజన్ కార్పొరేటర్ ఎంపల్ల అనంత రెడ్డి ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ అమ్మవారి బోనాలు మరియు కళ్యాణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా నగర మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పెద్దలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.