మహిళలకు 14 కుట్టుమిషన్లు పంపిణీ

Published: Wednesday May 25, 2022

ఖమ్మం, మే 24 (ప్రజాపాలన న్యూస్):  ఖమ్మంజిల్లా  ఖమ్మం పట్టణంలోని మోతినగర్ జె యస్ యస్ సెంటర్ ద్వారా ఉచిత టైలరింగ్ శిక్షణ పూర్తి చేసిన లబ్దిదారులకు గరికపాటి వెంకటరావు ఆర్ధిక సహాయంతో 14 కుట్టు మిషన్స్ మాజీ పార్లమెంట్ మెంబర్ శ్రీ తమ్మినేని వీరభద్రం  ద్వారా లబ్ధిదారులకు కుట్టు మొషన్స్, సర్టిఫికెట్స్ అందజేయడం జరిగిందని జన శిక్షణ సంస్థాన్ ఖమ్మం జిల్లా డైరెక్టర్ వై. రాధాకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా తమ్మినేని, ఎర్రా శ్రీకాంత్, చేతన ఫౌండేషన్ అధ్యక్షులు పసుమర్తి రంగారావు, రాధాకృష్ణ, నున్న రమణ, లింగయ్య, ఐద్వా నాయకురాలు పద్మ, మహిళమండలి అధ్యక్షులు  యస్కె రజియా, 35వ డివిజన్ కార్పొరేటర్ వెంకట్రావు డైరెక్టర్ రాధాకృష్ణ  మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో ఎదగాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అన్నిరంగాలలో ముందడుగు వేయాలని, శ్రీసిటీ అధినేత ద్వారా అందించిన ఆర్థిక సహాయం చాలా గొప్పది అని ఇంత పెద్ద మొత్తంలో సహాయం అందించిన   కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  జె యస్ యస్ స్టాఫ్,రిశోర్స్ పర్సన్స్ నాగమణి,ప్రశాంతి కవిత, జాస్మిన్, జాన్బీ, కిరున్నిసా బేగం,మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు.