లింగాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

Published: Saturday January 28, 2023

నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం పరిధిలో కాంగ్రెస్ కార్యకర్తల పై దాడులను నిరసనగా ఈరోజు  పోలీస్ స్టేషన్ ఎదురుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్న బిఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళితే స్థానిక ఎస్సై శ్రీనివాసులు స్పందించకపోగా, బాధితులపైనే కేసులు పెట్టడం చాలా బాధాకరమని, ఎస్సై గారు కేవలం బిఆర్ఎస్ పార్టీకి మాత్రమే పని చేస్తున్నారని విమర్శించారు. ఎస్సైను సస్పెండ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా సీఐ గారిని డిమాండ్ చేశారు. మండల యూత్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రాథోడ్ గారు మాట్లాడుతూ ఇదేవిధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో పార్టీ నిర్ణయం మేరకు పెద్ద ఎత్తున కార్యాచరణ చేసి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లింగాల కాంగ్రెస్ మండల టౌన్ ప్రెసిడెంట్ బుడ్డయ్య , పార్టీ సీనియర్ నాయకులు కొండల రావు , దిలీప్ ,యూత్ ఉపాధ్యక్షుడు కావేటి తరుణ్  మండల ఎస్టీసెల్ వెంకటేష్, దస్తగిరి, మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.