రైతులందరూ విద్యుత్ మోటార్లకు కెపాసిటర్లు అమర్చుకోవాలి: విద్యుత్ శాఖ ఏడిఇ.
Published: Monday February 22, 2021
మధిర, ఫిబ్రవరి 21, ప్రజాపాలన: మధిర సబ్ డివిజన్ పరిధిలోని మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల్లోని రైతులు అందరూ తమ వ్యవసాయ విద్యుత్ మోటార్ల కు తప్పనిసరిగా కెపాసిటర్ల ను అమర్చుకోవాలని విద్యుత్ శాఖ మదిర సబ్ డివిజన్ ఏ డి ఇ జె. పురుషోత్తం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులందరూ పొలాల్లో ఉన్న విద్యుత్ మోటార్ల కు కెపాసిటర్లు అమర్చుకోవడం వల్ల నాణ్యమైన విద్యుత్ ను పొందడమే కాకుండా మోటార్లు కాలిపోకుండా ఉంటాయన్నారు. కెపాసిటర్లు అమర్చుకోవడం వలన అనవసరమైన విద్యుత్ వాడకాన్ని నిరోధించడమే కాకుండా ట్రాన్స్ ఫారంల మీద అధికంగా లోడ్ పడకుండా ఉంటుంది అన్నారు. రైతులందరూ విద్యుత్ మోటార్లకు తక్షణమే కెపాసిటర్లు అమర్చుకోవాలని ఆయన ఈ సందర్భంగా రైతులను కోరారు.
Share this on your social network: