క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన కార్పొరేటర్ మంజుల రవీందర్

Published: Wednesday December 21, 2022
మేడిపల్లి, డిసెంబర్ 20 (ప్రజాపాలన ప్రతినిధి)
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ కార్పొరేటర్     బండారి మంజుల రవీందర్  క్రైస్తవ సోదరిమనులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో  డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు రాందాస్ గౌడ్,  బీఆర్ఎస్ నాయకులు ఈశ్వర్ రెడ్డి, సంఘపాక సుధాకర్ లింగం 15వ డివిజన్ యూత్ అధ్యక్షులు బత్తి సుమిత్ పాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.