నాలుగో రోజుకు చేరుకున్న ఎంఎన్అర్ ఐపీఎల్ 2

Published: Thursday March 31, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 30 ప్రజాపాలన ప్రతినిధి : మర్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగతున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఎమ్మెన్నార్ ఐపీఎల్-2 లో భాగంగా ఈరోజు బ్యాటిల్ బౌండరీస్ క్రికెట్ మైదానంలో నల్లవెల్లి  v/s దండు మైలారం గ్రామాల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో  నల్ల వెళ్లి జట్టు క్రీడాకారుడు వరి కుప్పల శ్రీను 40 బంతుల్లో 9 సిక్సర్లు, 12 పోర్లు, 114 పరుగులు సాధించాడు, బౌలింగ్ లో మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఆదిభట్ల మున్సిపాలిటీ కౌన్సిలర్ కుంట్ల మౌనిక ఉదయ్ పాల్ రెడ్డి  ముఖ్య అతిథిగా విచ్చేసి తన సొంతంగా ₹2000/- రూపాయలు అందజేశి అభినందించారు, ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు శ్రీశైలం యాదవ్, మహేష్ గౌడ్, చరణ్, గోవర్ధన్ రెడ్డి, చిన్న, శివ, ఇరు జట్ల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.