ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Monday August 01, 2022
మేడిపల్లి, జూలై31 (ప్రజాపాలన ప్రతిని)
 ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించి వారి మన్ననలను పొందాలని  పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.        మేడిపల్లి వరంగల్ ప్రధాన రహదారిలో పిల్లర్ నెంబర్111, డీ మార్ట్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన చెవి,తల, మెడకు సంబంధించిన కేకేఆర్ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి పాల్గొని డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు పాశం శశిరేఖ బుచ్చి యాదవ్, మద్ది యుగంధర్ రెడ్డి, ఆసుపత్రి యాజమాన్యంతో కలసి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఎండి డాక్టర్ కె వెంకట నాగేందర్ రెడ్డి, డాక్టర్ నీతా రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area