రైతులకు జీలుగు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Published: Saturday May 22, 2021
గుమ్మడిదల, మే 21, ప్రజాపాలన ప్రతినిధి : గుమ్మడిదల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జీలుగు విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు, 60 శాతం సబ్సిడీతో అందిస్తున్న జీలుగు విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి, జడ్పీటీసీ కుమార్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి, సహకార సంఘం అధ్యక్షులు నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి, డైరెక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, గటాటి భద్రప్ప, రైతులు, వివిధ శాఖల అధికారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.