జాతీయ స్థాయి పోటీలలో మధిర నాటకం నేడే
Published: Monday April 05, 2021
మధిర, ఏప్రిల్ 4, ప్రజాపాలన ప్రతినిధి : ముఖ సినిమా సంభాషణల రచయిత బుర్రా సాయిమాధవ్ ఆధ్వర్యంలో కళల కాణాచి తెనాలి వారు ఈనెల 3, నుంచి 7 వతేదీ వరకు నిర్వహించే పద్య నాటక పోటీలకు సుమిత్రా యూత్ అసోసియేషన్ వారు ప్రదర్శించే పాదుకా పట్టాభిషేకం పద్య నాటకం ఈరోజు ప్రదర్శిస్తున్నారని అధ్యక్షులు పబ్బతి రామబ్రహ్మం తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో 32 నాటకాలను ప్రాథమిక పరిశీలించగా 8 నాటకాలను ఎంపిక చేశారు. అందులో తెలంగాణ నుంచి మధిర వారి పాదుకా పట్టాభిషేకం నాటకం ఎంపిక కావడం పట్ల కళాపోషకులు పబ్బతి మోహన్ సీనియర్ కళాకారులు అంకురం శాస్తి, దొండపాటిపాపారావు కళాపోషకులు రిక్రియేషన్ క్లబ్ కార్యదర్శి గడ్డం శ్రీనివాస్ రావు, ఖమ్మం కళాపరిషత్ అధ్యక్షులు వి.వి అప్పారావు, కార్యదర్శి నాగ బత్తిన రవి లు కళాకారులను అభినందించారు. పోటీలలో బహుమతులు పొందాలని శుభాకాంక్షలు తెలియజేశారు
Share this on your social network: