మానసిక అభాగ్యులకు కరోనా టెస్టులు

Published: Thursday September 02, 2021
బాలాపూర్: సెప్టెంబర్ 1, ప్రజాపాలన ప్రతినిధి : మాతృదేవోభవ అనాధ ఆశ్రమవాసులకు 40 మందికి జ్వరాలని ఆశ్రమం వ్యవస్థాపకులు పేర్కొన్నారు. మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నటువంటి అనాధ, మానసిక వికలాంగులు అభాగ్యులకు 40 మంది వరకు జ్వరం, జలుబు తో ఇబ్బంది పడుతున్నారని, బుధవారం ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు గిరి బాలాపూర్ పి.హెచ్.సి ని సంప్రదించారు. బాలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధికారులు స్పందించి జ్వరం, జలుబుతో బాధపడుతున్న 40 మందికి ఆశ్రమంలో కరోనాటెస్ట్ లు నిర్వహించారు. ఆ మానసిక అభాగ్యులకు నెగిటివ్ నిర్ధారణ అయిందీని చెప్పారు. వైద్యాధికారులు మాట్లాడుతూ..... వర్షాకాలం వైరల్ జ్వరాలు అధికంగా ప్రబలే అవకాశం ఉంటుందని, దోమలు రాకుండా  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.