పట్టణ-ప్రగతి కార్యక్రమమంలో మధిర మునిసిపల్ చైర్ పర్సన్

Published: Friday July 09, 2021
మధిర, జులై 08, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిర మున్సిపాలిటీ పరిధి నందు మూడో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మొండితోక లత మరియు మున్సిపల్ కమిషనర్ రమాదేవి గారి ఆధ్వర్యంలో 22వ వార్డు మరియు 4వ వార్డుల యందు మొక్కలు నాటడం మరియు ప్రతి ఇంటింటికి 6 మొక్కలు చొప్పున పంచడం జరిగింది మధిర ఈ సందర్భంగా కమీషనర్ చైర్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం మనం పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అని పేర్కొన్నారు, మన పట్టణాన్ని అన్నీ విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని కౌన్సిలర్లు అధికారులు కలుపుకుంటూ పోతు పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని కొరినారు. ఈ కార్యక్రమంలో 22వ వార్డు కౌన్సిలర్ కట్టా గాంధీ గారు, ప్రజాప్రతినిధులు, మేనేజర్ రవీంద్ర గారు, వార్డు ఇంచార్జ్ లు, మెప్మా ఆర్పీ లు, ఆశ వర్కర్ లు తదితరులు పాల్గొన్నారు.