టిఐడీసీ పరిశ్రమలో ఓ కార్మికుడు మృతి

Published: Thursday June 24, 2021
జిన్నారం మండలం ఖాజీపల్లి పరిశ్రమ వాడలోని టీఐడిసి చైన్ ఇండియా పరిశ్రమలో మంగళవారం రాత్రి  సంతోష్ రెడ్డి అనే కార్మికుడు మృత్తిచేందిన సంఘటన చోటు చేసుకుంది. దీనిపై బొల్లారం సీఐ గౌరి ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం సూరారంలో నివాసం ఉంటున్న సంతోష్ రెడ్డి, తండ్రి మల్ల రెడ్డి, వయస్సు 26, టీఐడిసి పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అయితే రోజు మాదిరిగానే విధులకు హాజరై తిరిగి ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు పరిశ్రమ వద్దకు వచ్చి సంతోష కుమార్ రెడ్డి గురించి వివరాలు అడగగా పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో భయాందోళనకు గురై, తమకు తెలిసిన చోట వెతికరు. అయితే బుధవారం ఉదయం తమ కుమారుడు పరిశ్రమలోని ఆయిల్ ట్యాంక్లో పడి మృతి చెందరని తెలియడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతుడు మంగళవారం రాత్రి 11 గంటలకు పరిశ్రమలోని హెచ్ఎఫ్5 ఫోరెన్స్ అయిలు ట్యాంక్ వద్ద, అయిలు బయటికి వస్తుండంతో ఆయిల్ ట్యాంక్ మూత తెరిచి చూడగా వికత జీవిగా పడి వున్నా సంతోష రెడ్డిని చూసి బొల్లారం పోలీసులకు కంపెనీ యాజమాన్యం పిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు మృత దేహాన్ని పటాన్ చేరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించరు. బుధవారం మృతిని కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నమని బొల్లారం సీఐ ప్రశాంత్ తెలిపారు.