నమిలికొండలో ఘనంగా ఎల్లమ్మ సిద్దోగం

Published: Thursday December 02, 2021

కొడిమ్యాల, డిసెంబర్ 01(ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండలంలోని నమిలికొండ గ్రామంలో గౌడ కులస్తులు ఘనంగా ఎల్లమ్మ సిద్దోగం నిర్వహించారు. గౌడ కులస్తులు అందరూ ప్రతి ఇంటి నుండి ఒక బోనం తీసుకెళ్లి మొక్కులు చెల్లించి రేణుక ఎల్లమ్మ తల్లి ప్రజలందరినీ చల్లగా చూడాలి అని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు మంద పరుశరామ్ గౌడ్, గౌడ సంఘం నాయకులు విక్కుర్తి నాగరాజు గౌడ్, రమేష్ గౌడ్, భాస్కర్ గౌడ్, మంద, శ్రీనివాస్ గౌడ్, కొడిమ్యాల ఎంపీపీ మేనెని స్వర్ణలత, కొడిమ్యాల సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, సింగిల్విండో చైర్మన్ మేనేని రాజనర్సింగరావు, తెరాస మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, నాయకులు మల్యాల నరేష్, లింగన్న, మహేందర్, బల్కం మల్లేష్ యాదవ్, బొడ్డు రమేష్, కొండగట్టు దేవస్థాన డైరెక్టర్ లింగా గౌడ్, గంగల మల్లేష్ యాదవ్, సురేష్, యుగేందర్ గౌడ్, యూసుఫ్, ఇంతియాజ్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు