బిజెపి, కాంగ్రెస్ పార్టీల నుండి బిఆర్ఎస్ లోకి చేరికలు

Published: Thursday December 22, 2022
బెల్లంపల్లి డిసెంబరు 21 ప్రజా పాలన ప్రతినిధి: భారత రాష్ట్ర సమితి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి, బిజెపి, కాంగ్రెస్, పార్టీల నుండి పలువురు బిఆర్ఎస్ పార్టీలో చేరారని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు.
బుధవారం నాడు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారికి కండువాలు వేసి ఆహ్వానించారు, అనంతరం ఆయన మాట్లాడారు,
తెలంగాణ రాష్ట్రంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై,  నియోజకవర్గంలోని
 తాండూర్ మండల బిజెపి, అధ్యక్షురాలు సంఘర్షీత శీతాల్ , మహిళా మోర్చా  కార్యదర్శి కొప్పుల రవళి, బెల్లంపల్లి  కాంగ్రెస్ పార్టీకి చెందిన,  కంది రాజేశ్వరరావు ,  చీటీ పోషం , నయీమ్ , హాజీ ,  సరళ, ఫాజీమా , కల్పన , తదితరులు సుమారు నలభై మంది నాయకులు, కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ ,  కాసర్ల యాదగిరి , తదితరులు పాల్గొన్నారు.