బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా జోషి సుభాష్ చంద్రకాంత్ శర్మ

Published: Tuesday August 10, 2021
వికారాబాద్ బ్యూరో 09 ఆగస్ట్ ప్రజాపాలన :  నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం అధ్యక్షునిగా జోషి సుభాష్ చంద్రకాంత్ శర్మ ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో ఎన్నికల అధికారి మనోహరశర్మ ఆధ్వర్యంలో బ్రాహ్మణ సంఘం ఎన్నికలు జరిగాయి. బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడుగా జోషి సుభాష్ చంద్రకాంత్ శర్మ (వికారాబాద్), ఉపాధ్యక్షులుగా ద్యాచారం శ్రీనివాస్ రావు (వికారాబాద్), వెంకటరమణ ఆలంపల్లి, శ్రీపాద శర్మ ఎల్లకొండ, ఉదయరావు మర్పల్లి, మహిళా ఉపాధ్యక్షురాలిగా సునేత్ర ఎబ్బనూర్, ప్రధాన కార్యదర్శిగా కరణం దత్తాత్రేయ రావు వికారాబాద్, సంయుక్త కార్యదర్శులుగా ఎ.భోగేష్ వికారాబాద్, సేతురామాచార్యులు ఆలంపల్లి, కృష్ణ మోమిన్ పేట్, మహిళా సంయుక్త కార్యదర్శిగా శోభాకులకర్ణి ధారూర్, కోశాధికారిగా అనంతపద్మనాభ రావు వికారాబాద్ ఎన్నికయ్యారు. ఎన్నికైన కార్యవర్గాన్ని సన్మానించారు.