జగిత్యాల అర్బన్ ఎంపీపీ మృతి పరామర్శించిన జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్

Published: Friday June 25, 2021
జగిత్యాల, జూన్ 24 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల అర్బన్ ఎంపిపి మ్యాదరి వనిత ఆనారోగ్యంతో గురువారం రోజున ఉదయం మరణించగా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జగిత్యాల అర్బన్ మండలంలోని గోపాల్రావుపేట మరియు తిప్పన్నపెట గ్రామంలోని లైశెట్టి రాజలింగం బక్కురి నవీన్ మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదర్శారు. దావ వసంతసురేష్ వెంట మాజీ వైస్ ఎంపీపీ గంగం మహేష్ దరూర్ సర్పంచ్ ప్రభాకర్ ప్యాక్స్ వైస్ చైర్మన్ శీలం సురేందర్ స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.