ప్రమాదకరం గా మారిన విద్యుత్ స్థంభం

Published: Friday July 23, 2021

అధికారులకు చెప్పిన పట్టించుకోని వైనం
పరిగి, జులై 22, ప్రజాపాలన ప్రతినిధి : దిర్సoపల్లి గ్రామంలో ఇంటి దగ్గర విద్యుత్ స్థంభం ప్రమాదకరంగా మారింది. వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని దిర్సoపల్లి గ్రామంలో పెద్ద గొల్ల నర్సింలు ఇంటిిదగ్గర విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది. వర్షం పడినప్పుడు అందులో నుండి మంటలు వస్తున్నాయనిి కుటుంంబ సభ్యులు ఆవేదన వ్యక్తంతం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా అలాగే పల్లె ప్రగతి లో సమస్యను గురించి వివరించిన ఇంతవరకు అధికారులు స్పందించలేదని కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. ఈ స్థంభం పక్కన ఇనుపరేకుల ఇల్లు ఉండటం తో ఆ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. కరెంటు తీగలు ఎప్పుడు తెగి పడతాయో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొనిి ఉంటున్నారు. కావున వెంటనే అధికారులు స్పందించాలని వారు అధికారులను డిమాండ్ చేశారు.